‘కప్పట్రాళ్ల’ హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు

57చూసినవారు
‘కప్పట్రాళ్ల’ హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు
ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన కప్పట్రాళ్ల ఫ్యాక్షన్ గొడవల్లో 11 మంది హత్య కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవితఖైదు పడిన వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించింది. నేర నిరూపణకు పోలీసులు సమర్పించిన ఆధారాలు నమ్మశక్యంగా లేవన్న లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది. కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో 2008 మే 17న వెంకటప్పనాయుడుతో పాటు 10 మందిని మద్దిలేటి నాయుడు, అనుచరులు నరికి చంపేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్