షర్మిలను అందుకే పక్కన పెట్టారు: సునీత

77చూసినవారు
షర్మిలను అందుకే పక్కన పెట్టారు: సునీత
షర్మిలకు ఆదరణ వస్తోందని వైసీపీ పక్కన పెట్టినట్లు వైఎస్ వివేకా కుమార్తె సునీత అన్నారు. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల పార్టీని భుజాలపై వేసుకొని నడిపించారని తెలిపారు. అప్పట్లో ఉపఎన్నికల్లో పోటీ చేసిన వారిని షర్మిల దగ్గరుండి గెలిపించారని గుర్తు చేశారు. ఆమెకు ఆదరణ పెరగడంతో 2014 ఎన్నికల్లో విశాఖకు పంపాలని నిర్ణయించారన్నారు. పులివెందులలో అవినాష్ కుటుంబం వెన్నుపోటుతో వివేకా ఓటమిపాలయ్యారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్