కాంగ్రెస్ పూర్వవైభవం కోసం షర్మిల కసరత్తు!

69చూసినవారు
కాంగ్రెస్ పూర్వవైభవం కోసం షర్మిల కసరత్తు!
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు పీసీసీ చీఫ్ షర్మిల శ్రమిస్తున్నారు. 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు నుంచి 28 వరకు విజయవాడలో ఉండనున్నారు. అన్ని జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు సమాలోచనలు చేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్