ఒడిశాలోని ఆ రెండు ఆలయాలు మూసివేత

69చూసినవారు
ఒడిశాలోని ఆ రెండు ఆలయాలు మూసివేత
తీవ్ర తుఫాను నేపథ్యంలో భారత పురావస్తు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశా పూరీలోని జగన్నాథ ఆలయంతో పాటు కోణార్క్‌లోని సూర్య దేవాలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించింది. తుఫాను కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ఆలయాలను మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఆ ఆలయాలతో పాటు పలు స్మారక చిహ్నాలు, మ్యూజియాలను సైతం మూసివేయనున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్