వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి. ఎస్ఐ

66చూసినవారు
వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి. ఎస్ఐ
వినాయక చవితి పర్వదిన సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు పోలీసు అనుమతి పొందాలని ఉలవపాడు ఎస్సై అంకమ్మ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పోలీసు పర్మిషన్ కోసం లింక్ ద్వారా ఆన్లైన్ ఓపెన్ పోర్టల్ నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ సేవకు వెళ్లి పేమెంట్ చెల్లించిన తర్వాత పోలీసు అనుమతి ఇవ్వడం జరుగుతుందని ఎస్ఐ తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్