రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ ను నెల్లూరు నగరంలోని సంతపేటలో గల క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందజేశారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి అంశాలను వారితో చర్చించారు.