ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ్టి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష ప్రారంభించారు. అయితే దీక్షలో పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకుని దర్శనమివ్వడంతో నెట్టింట సంచలనంగా మారింది. ఈ ఫోటోపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. ‘బీజేపీని మెప్పించడానికా? చెప్పులతో దీక్షలు. వాట్ ఏ హిందూ ఫాలొవర్’ అంటూ ట్విట్ చేసింది.