ధర్మవరం ఆర్డిటి క్రికెట్ కోచింగ్ సెంటర్లో ప్రాక్టీస్ చేస్తున్న బాలికలు నాగజ్యోతి, తేజు దీపిక అండర్ 19 అనంతపురం జిల్లా జట్టుకి ఎంపికైనట్లు క్రికెట్ కోచ్ రాజశేఖర్ గురువారం తెలియజేశారు. ఈ టీమ్ జూన్ 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెంకటగిరిలో జరిగే అండర్ 19 ఇంటర్ జిల్లా టోర్నమెంట్లో పాల్గొంటుందని కోచ్ తెలియజేశారు.