కూటమి అధికారంలోకి వస్తే ప్రతిసమస్యను పరిష్కరిస్తా: సత్యకుమార్
![కూటమి అధికారంలోకి వస్తే ప్రతిసమస్యను పరిష్కరిస్తా: సత్యకుమార్](https://media.getlokalapp.com/cache/ad/fd/adfd952809ed29b0ac1884f71694eb6e.webp)
కూటమి ప్రభుత్వంలో వ్యవసాయరంగానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ధర్మవరం మండలం ధర్మపురి, ఆకుతోటపల్లి, రావులచెరువు, నాగిరెడ్డికుంట, ఎర్రగుంటపల్లి, వెంకటతిమ్మాపురం, మాలగుండ్లపల్లి, మల్లాకాల్వ, సి. బత్తలపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఐదేళ్ల నుండి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు తనతో పంచుకున్నారన్న సత్య కుమార్. అధికారంలోకి రాగానే ప్రతిఒక్కటి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.