అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని మేడా వీధిలో సోమవారం ఒక భవనంపై రంగులు వేస్తుండగా తాడు తెగడంతో ఎన్టీఆర్ కాలనీకి చెందిన వినోద్ కుమార్ అనే పెయింటర్ కింద పడిపోయి మరణించాడు.వెంటనే సాటి కార్మికులు అతన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.కానీ మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.