రాప్తాడు మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మండలానికి ఎగువ ప్రాంతాలైన రామగిరి కనగాణపల్లి మండల నుంచి వరద నీరు ఉధృతంగా వచ్చి చేరడంతో వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రైతుల్లో ఆనందం నెలకొంది. పొంగే వాగులను తిలకించడానికి రైతులు భారీగా తరలివచ్చారు.