సింగనమల మండలంలో మంగళవారం సీపీఎం మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. 2023 ఖరీఫ్, రబీ ఇన్సూరెన్స్ ప్రకటించాలని, అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం కింద రూ. 20 వేలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని కోరారు. జిల్లాలో కూలీలు వలసల పోకుండా పనులు కల్పించాలన్నారు.