ట్రాన్స్ ఫార్మర్ లను పగుల కొట్టి విద్యుత్ తీగలు చోరీ

51చూసినవారు
ట్రాన్స్ ఫార్మర్ లను పగుల కొట్టి విద్యుత్ తీగలు చోరీ
బుక్కరాయసముద్రం మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. మండల పరిధిలోని బొమ్మలాటపల్లి గ్రామ శివారులో రైతుల వ్యవసాయ పొలాలు వద్ద రెండు ట్రాన్స్ ఫార్మర్ లను సోమవారం రాత్రి పగల కొట్టి రాగి తీగలను ఎత్తుకెళ్లారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా చుట్టు పక్కల మండలాల్లోనూ చోరీలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్