తాడిపత్రి మండలంలో ఎనిమిది మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

85చూసినవారు
తాడిపత్రి మండలంలో పేకాట స్థావరాలపై శనివారం పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. మండలంలోని కావేటి సముద్రంలో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి తెలిపారు. మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్