రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

1029చూసినవారు
పెద్దవడుగూరు మండలం కాశేపల్లి సమీపంలో ఉన్న 44వ జాతీయ రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆటో డ్రైవరు శివ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కుందిర్పి మండలం ఎనుములదొడ్డికి చెందిన ఆటో డ్రైవరు శివ సొంతపనుల నిమిత్తం గుత్తికి ఆటోలో వచ్చాడు. పనులు ముగించుకుని వెళ్తుండగా కాశేపల్లి వద్దకు రాగానే ముందు నిలబడిన ట్యాంకరును ఢీకొన్నాడు. ఆ వెంటనే వెనక వస్తున్న ఆటోను కారు ఢీకొంది. ఆటో చోదకుడికి గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్