మలేరియా వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం ఉరవకొండ పట్టణంలో ప్రభుత్వ వసతి గృహాలలో మలాథియాన్ మందును స్పే చేయించారు. మలేరియా సభ్యులు అధికారి కోదండరామిరెడ్డి మాట్లాడుతూ. దోమలు వృద్ధి చెందకుండా ఉండటానికి స్ప్రే చేయించామన్నారు. వసతి గృహాలను శుభ్రంగా ఉంచుకోవాలని వార్డెన్లకు సూచించారు.