విడపనకల్లు మండలం గడేకల్లులో శ్రీ వేములవాడ భీమలింగేశ్వర స్వామివారి రథోత్సవం మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది. రథోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామి వారి జీవసమాధికి, మూలవిరాట్కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మహా మంగళహారతి తదితర పూజలు చేశారు. స్వామి వారికి భక్తులు టెంకాయలు, మద్యం నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.