ఘనంగా ఎస్సార్ రంగనాథన్ జయంతి వేడుకలు

560చూసినవారు
లావేరు మండల శాఖా గ్రంథాలయంలో సోమవారం ఉదయం గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్సార్ రంగనాథన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలిత ఆయన చిత్రపటానికి గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగనాథన్ భారతదేశంలో తమిళనాడులోని షియాలీలో ఆగస్టు నెల 1892లో జన్మించారు. రంగనాధన్ లైబ్రరీ సైన్స్ రంగంలో దూరదృష్టి గల మార్గదర్శకుడని కొనియాడారు.

సంబంధిత పోస్ట్