రణస్థలం మండలంలో పలు విత్తనాలు, ఎరువులు పురుగు మందుల దుకాణాలపై మంగళవారం వ్యవసాయ విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రణస్థలం మనగ్రోమోర్ దుకాణంలో తాడేపల్లిగూడెం వ్యవసాయ సహాయ సంచాలకులు పి మురళీకృష్ణ విజిలెన్స్ డిఎస్పి ఎస్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో షాపులలో విత్తనాలు ఎరువులు పురుగు మందులకు సంబంధించి రికార్డులు బిల్లు పుస్తకాలు గోడౌన్ స్టాక్ నిల్వలను తనిఖీ చేశారు.