గణపతి మండపం వద్ద మహా అన్నదానం

84చూసినవారు
సంతకవిటి మండలం కొత్తూరు రామచంద్రపురం గ్రామంలోని రామాలయం వద్ద.. వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా బుధవారం మండప ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. పరిసర గ్రామాల నుంచి సుమారు రెండు వేల మందికి పైగా భక్తులు పాల్గొని స్వామి వారి దర్శించుకుని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యవత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్