పసికందు గర్భంలోనే మృతి.. హాస్పిటల్ ఎదుట ధర్నా

64చూసినవారు
ఇచ్ఛాపురం పట్టణంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. ఇచ్ఛాపురం పట్టణంలోని ఓ నర్సింగ్ హోమ్ లో మంగళవారం సాయంత్రం ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులతో చేరింది. అయితే తల్లి గర్భంలోనే మగ శిశువు ప్రాణాలు పోయాయి. ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ గర్భంలోనే మృతి చెందాడని తండ్రితో పాటు బంధువులు బుధవారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్