కోటబొమ్మాళి మండలం నిమ్మాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి సోమవారం అకస్మికంగా సందర్శించారు. పీహెచ్సి డాక్టర్ నితీస్కుమార్తో వైద్యశాలలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పలు రికార్డులను, ఓపీని పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు ఎల్లవేళలా వైద్య సేవలు అందించాలని ఆమె సూచించారు.