వేడుకగా భవానీ భక్తుల ఇరుముడి కార్యక్రమం

441చూసినవారు
వేడుకగా భవానీ భక్తుల ఇరుముడి కార్యక్రమం
ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం గ్రామంలో సోమవారం భవానీ భక్తుల 41 రోజుల దీక్ష ఇరుముడి కార్యక్రమం.. గురు భవానీలు ఎల్.శంకర్రావు, కె.గౌతమ్ పర్యవేక్షణలో వేడుకగా జరిగింది. తొలుత 40 మంది భవానీ భక్తులు, గ్రామ ప్రజలు కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. స్ధలదాత గాలి అప్పలగురువులు ఆధ్వర్యంలో రెండు వేల మంది భక్తులకు అన్నదానం చేపట్టారు. దీంతో పరిసర గ్రామాల నుంచి భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం భవానీ భక్తులు విజయవాడ కొండకు తరలివెళ్లారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్