గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
జిల్లాలోని గార మండలం శాలిహుండం గ్రామ సమీపంలో వంశధార నదీ గర్భంలోని చెట్టుకు ఓ వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వీఆర్వో పాపారావు ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పరిసర ప్రాంతాలకు, ఇతర పోలీస్ స్టేషన్లకు వివరాలు అందజేశారు. మృతదేహంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు.