కంచిలి వైసిపిలో చేరిక

85చూసినవారు
కంచిలి వైసిపిలో చేరిక
కంచిలి మండలం జలంత్రకోట, బూరగాం గ్రామాలకు చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైసిపీలో సోమవారం చేరారు. వీరిని స్థానిక ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, జెడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షిలు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ పరిపాలనకు ఆకర్షితులమై వైసిపీలో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో మధుపురం గ్రామానికి చెందిన డొక్కరి యాదవయ్య, చొట్రాయిపురం గ్రామానికి చెందిన డొక్కరి కుమార్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్