జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

7429చూసినవారు
కంచిలి మండలంలోని బూరగాం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా రాష్ట్రం జైపూర్ నుంచి భువనేశ్వర్ కు కారులో వెళ్తుండగా. బూరగాం సమీపంలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని మూడు పల్టీలు కొడుతూ పంట పొలాల్లోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సీట్ బెల్ట్ ధరించడంతో క్షేమంగా బయటపడ్డారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్