సోంపేట మండలం కొర్లాం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయి అదుపుతప్పి కంటైనర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సోంపేట మండలం మామిడిపల్లికి చెందిన ఇంజినీరింగ్ అసిస్టెంట్ మేఘనాథ్ గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం అంబులెన్స్లో బారువా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.