పోలాకి మండలం బెలమర జంక్షన్ వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బెలమర కి చెందిన మడ్డు పురుషోత్తమరావు (30) మృతి చెందాడు. పిన్నింటిపేట నుంచి బెలమర కు స్కూటీపై వస్తుండగా అదుపుతప్పి ఎదురుగా ఉన్న గోడను ఢీ కొట్టి తీవ్ర గాయాలు పాలయ్యాడు. తీవ్ర గాయాలు పాలైన అతన్ని నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఏ ఎస్ ఐ ఆదినారాయణ కేసు నమోదు చేశారు.