May 09, 2024, 05:05 IST/మానకొండూర్
మానకొండూర్
కాంగ్రెస్కు మద్దతుగా సిపిఐ ఇంటింటి ప్రచారం
May 09, 2024, 05:05 IST
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాలా రాజేందర్రావు కు మద్దతుగా శంకరపట్నం మండలం కేశవపట్నంలో గురువారం సిపిఐ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఇండియా కూటమిలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించేందుకు సిపిఐ పార్టీ ఇంటింటి ప్రచారం చేస్తుందని మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య తెలిపారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో వెలిచాలకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.