9న డీవార్మింగ్ డే విజయవంతం చేయండి
సారవకోట మండలంలోని బొంతు పీహెచ్సీ పరిధిలో ఈ నెల 9న నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు ఎంపీహెచ్ఓ గణిబాబు మంగళవారం తెలిపారు. పీహెచ్సీలో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 48 పాఠశాలలు, 52 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 2, 707 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.