ప్రతిభ కనబరిచిన ఇంజనీరింగ్ విద్యార్థులు

52చూసినవారు
ప్రతిభ కనబరిచిన ఇంజనీరింగ్ విద్యార్థులు
శ్రీకాకుళం జిల్లా డా. బి. ఆర్. అంబేడ్కర్ యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల- మోకానికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రికల్ కారును మంగళవారం వీసీ ఆచార్య కె. ఆర్. రజని ఆవిష్కరించారు. మారుతి 800 కారుకు ఆధునాతన హంగులు, నూతన సాంకేతిక మార్పులు చేసి ఎలక్ట్రికల్ వాహనంగా మార్చారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి. సుజాత, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డా. సిహెచ్. రాజశేఖరరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్