హెల్మెట్ ధరించండి - ప్రాణాలను కాపాడుకొండి

55చూసినవారు
ద్విచక్ర వాహనము నడిపేటప్పుడు వాహనదారుడు వారి వెనుక కూర్చున్నవారు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని టెక్కలి ఇంచార్జి సీనియర్ సివిల్ జడ్జి జె. శ్రీనివాస రావు అన్నారు. హైకోర్టు తీర్పు మేరకు టెక్కలి మండల సమీపం లోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజిలో శుక్రవారం ఇంజనీరింగ్ విద్యార్థులతో ఆయన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్