విషాదం.. పోలింగ్ వేళ CRPF సిబ్బంది మృతి

54చూసినవారు
విషాదం.. పోలింగ్ వేళ CRPF సిబ్బంది మృతి
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల పోలింగ్ వేళ విషాదం జరిగింది. కూచ్‌బెహార్‌లోని మథభంగాలో ఉన్న ఓ పోలింగ్ బూత్ వాష్‌రూమ్‌లో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఒకరు జారిపడ్డారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆయన తలకు బలమైన గాయం అయినట్లు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఇందులో కుట్ర కోణం ఉన్నట్లు ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్