ఆగిపోయిన సీఎం జగన్ బస్సు యాత్ర

70చూసినవారు
ఆగిపోయిన సీఎం జగన్ బస్సు యాత్ర
2024 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా సీఎం జగన్ దూసుకెళ్తున్నారు. మార్చి 27న ‘మేమంతా సిద్ధం’ పేరిట సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కడపలో మొదలైన బస్సుయాత్ర, కర్నూలు జిల్లాలో సాగుతూ.. అనంతపురంలో ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉండగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు వైసీపీ ఒక రోజు విరామం ప్రకటించింది. ఆదివారం ఈస్టర్ కారణంగా బస్సు యాత్రకు సీఎం జగన్ బ్రేక్ ఇస్తున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్