ఇలాంటి దాడులు తనను ఆపలేవని సీఎం జగన్ అన్నారు. సోమవారం 15వ రోజు బస్సు యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటించారు. ప్రజల ఆశీర్వాదంతోనే ఆరోగ్యంగా ఉన్నానని సీఎం జగన్ అన్నారు. ఎవరూ భయపడవద్దని తెలిపారు. దేవుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ తన వెంట ఉన్నాయన్నారు. ధైర్యంగా ముందుకు అడుగులు వేద్దామని సీఎం జగన్ పిలుపునిచ్చారు.