ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్‌

4470చూసినవారు
ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్‌
సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన వైమానిక దాడి ఇజ్రాయెల్‌ పనేనని ఇరాన్‌ భావిస్తోంది. ఆ దాడిలో ఇరాన్‌ దళానికి చెందిన ఏడుగురు సైనికాధికారులు మృతి చెందారు. దానికి ప్రతీకారంగా ఇరాన్‌.. శనివారం 170 డ్రోన్లు, 30కి పైగా క్రూజ్‌, 120కి పైగా బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడింది. ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌’ పేరుతో విడతల వారీగా డ్రోన్లను ప్రయోగించింది. తర్వాత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది.

సంబంధిత పోస్ట్