భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబును కోరారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆమె సీఎంకు లేఖ రాశారు. కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం వల్లే పంటపొలాలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిళ్లిందన్నారు. రైతుల దుస్థితిపై ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.