AP: టీడీపీపై వైసీపీ నేత పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. "వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ కుట్రలకు కొందరు పోలీసులు, అధికారుల సహకారం ఉంది. అందుకే ఎమ్మెల్యే ఇంటి దగ్గర బలగాలను తొలగించారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ కూడా కూటమి నేతలు చెప్పినట్లు వ్యవహరిస్తోంది." అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.