టీడీపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మంగళ, బుధ వారాల్లోపు కొంతమందిని ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 17 లోక్సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తోంది. ఇప్పటికే 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం వరకు వారి పేర్లు వెల్లడించే అవకాశాలున్నాయి.