కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఉన్న మూడు పెద్ద హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంట్లో ప్రఖ్యాత ఒటెరా హోటల్ కూడా ఉన్నది. ప్రస్తుతం ఒటెరా హోటల్ వద్ద బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సౌత్ ఈస్ట్ బెంగుళూరు డీసీపీ తెలిపారు. బుధవారం ఢిల్లీలో కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. నార్త్ బ్లాక్ ప్రాంతంలో ఆ కాల్స్ వచ్చినట్లు తేలింది. కానీ ఆ బెదిరింపులు ఉత్తవే అని అధికారులు గుర్తించారు.