‘టీడీపీకి రాజ్యసభలో చోటే లేకుండా పోయింది’

370831చూసినవారు
‘టీడీపీకి రాజ్యసభలో చోటే లేకుండా పోయింది’
40 ఏళ్ల తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో చోటు లేకుండా పోయిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పరిపాలనలో బీసీలకు న్యాయం జరిగిందన్నారు. శెట్టిబలిజలపై చిన్న చూపు అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి 8 మంది శెట్టిబలిజలను సీఎం జగన్ చట్టసభలకు పంపించారని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్