చంద్రబాబు వల్లే బీజేపీ, జనసేనకు అసలు ఉనికే లేకుండా పోయిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. "కూటమిలో ఉన్నప్పటికీ చంద్రబాబు ఎవరికి అనుకుంటే వాళ్లకు సీట్లు ఇచ్చేలా చేశారు. తన మనుషులకే టికెట్లు ఇప్పించుకున్నారు. బీజేపీలో కూడా బాబు చెప్పినట్లే సీట్లు ఖరారు అయ్యాయి. కానీ, 2019 ఎన్నికలంటే టీడీపీ ఘోరంగా ఓడిపోబోతోంది. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుంది." అని సజ్జల పేర్కొన్నారు.