సాయిధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత

66చూసినవారు
సాయిధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత
పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి సాయిధరమ్ తేజ్ వాహనంపైకి రాయి విసిరాడు. ఆ రాయి జనసేన కార్యకర్త నల్లల శ్రీధర్‌కు తగిలి తీవ్ర గాయమైంది. దాంతో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతనే దాడి చేయించి ఉంటుందని జనసైనికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్