విశాఖలో ఉద్రిక్తత.. ఉక్కు కార్మికుల రాస్తారోకో!

80చూసినవారు
విశాఖలో ఉద్రిక్తత.. ఉక్కు కార్మికుల రాస్తారోకో!
ఏపీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం కూడలిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ, నిర్వాసితుల రాస్తారోకోలో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నేషనల్ హైవేను దిగ్భందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరిస్తున్నారు. కూర్మన్నపాలెం జంక్షన్‌లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్