రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం అందుబాటులో ఉంచనున్నట్లు ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదివారం తెలిపారు. 3 నుంచి 16 వరకు దరఖాస్తు రుసుము.. 4 నుంచి 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.