నాలుగో రోజుకు చేరుకున్న బస్సు యాత్ర

63చూసినవారు
నాలుగో రోజుకు చేరుకున్న బస్సు యాత్ర
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ అన్ని రాజకీయ పార్టీలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం' యాత్ర ఈ రోజుతో నాలుగో రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా ఇవాళ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఉ.10 గంటలకు జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రాతన, తుగ్గలి, జొన్నగిరి మీదుగా నేడు ఈ యాత్ర అనంతపురంలోకి ప్రవేశించనుంది.

సంబంధిత పోస్ట్