గుంటూరు
టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కు భారీ షాక్ తగిలింది. ఈ నెల 25న సద్దాం హుస్సేన్పై చంద్రశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లు చీల్చి ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటంతో వారు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దాంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు చంద్రశేఖర్కు నోటీసులు ఇచ్చారు.