నల్లమిల్లికి సీటు ఇవ్వాలని ముగ్గురు ఆత్మహత్యాయత్నం

62చూసినవారు
నల్లమిల్లికి సీటు ఇవ్వాలని ముగ్గురు ఆత్మహత్యాయత్నం
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వాలని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ బీజేపీకి వెళ్లింది. దాంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న నల్లమిల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని అనుచరులు ఆందోళన చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్