బాతులు మేపడానికి వెళ్లి.. ఇద్దరు చిన్నారులు అదృశ్యం

59చూసినవారు
బాతులు మేపడానికి వెళ్లి.. ఇద్దరు చిన్నారులు అదృశ్యం
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడులో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. పొలంలో బాతులు మేపడానికి వెళ్తూ తల్లిదండ్రులు పిల్లలను తీసుకెళ్లారు. తల్లిదండ్రులు కొంత దూరం వెళ్లేసరికిి పిల్లలు అదృశ్యమయ్యారు. అదృశ్యమైన పిల్లలు నెల్లూరు జిల్లా జలదంకికి చెందిన నాగులూరి మహేశ్, భూమికగా పోలీసులు గుర్తించారు. శుక్రవారం తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్