AP: జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జనసైనికులు నెట్టింట స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో గూస్బంప్స్ తెప్పిస్తోంది. 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో జనసేన పార్టీని ప్రకటించారు. పదేళ్లపాటు ప్రజా సమస్యలపై పోరాటం చేసింది. 100 శాతం స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చింది. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది.